Friday, December 28, 2018

కేస‌ర్ పిస్తా మిల్క్ షేక్‌






కావాల్సిన పదార్థాలు :


  • పిస్తా పప్పు - 1 కప్పు
  • కుంకుమ పువ్వు - కొద్దిగా
  • బాదం - అర కప్పు
  • పంచదార - ఒకటిన్నర కప్పు
  • యాలకులు -5, పాలు - 1 లీటరు



తయారు చేసే విధానం :


  • ముందుగా బాదం, పిస్తాలను రెండు రెండు వేరువేరు గిన్నెలలో తీసుకుని 6 గంటల సేపు నానబెట్టాలి.
  • ఆరు గంటల తర్వాత గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి.
  • పాలను బాగా మరిగించి, మంట తగ్గించి మరికొంత సేపు బాగా పాలు కాయాలి.
  • ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ తీసుకొని అందులో ముందుగా నానబెటట్టుకున్న బాదం, పిస్తాలు, యాలకుల వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ పేస్ట్‌ను కాగుతున్న పాలలో వేసి బాగా కలవనివ్వాలి.
  • ఇప్పుడు ఆ పాలలో పంచదార వేసి కలుపుకోవాలి.
  • తర్వాత చివరగా కొద్దిగా కుంకుమపువ్వు చిలకరించాలి.
  • పాలను తక్కువ మంటలోనే ఉడికించాలి.
  • పాలు కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి ఈ మిల్క్‌ షేక్‌ని కాసేపు చల్లారనివ్వాలి.

No comments:

Post a Comment