Thursday, April 9, 2020

పనస గింజల వడలు తయారు చేయడం | పాకశాల - Pakashala



 కావలసిన పదార్థాలు: 


పనస గింజలు - 2 కప్పులు, 

బియ్యప్పిండి - ఒక కప్పు, 


పచ్చిమిర్చి - 4, 

పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, 


ఉల్లి తరుగు - అరకప్పు,
జీలకర్ర - ఒక టీ స్పూను, 


ఉప్పు - రుచికి సరిపడా,
కొత్తిమీర తరుగు - పావుకప్పు, 


అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను,
నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: 


పనస గింజల పై పొట్టు తీసి కుక్కర్లో ఉడికించాలి. 

మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర, ఉల్లితరుగు, బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొంత కొంత తీసుకుని వడలుగా ఒత్తి కాగిన నూనెలో దోరగా రెండువైపులా వేగించుకోవాలి.

ఇష్టమైనవారు ఇదే మిశ్రమాన్ని పకోడీగా కూడా వేసుకోవచ్చు. 





No comments:

Post a Comment