Saturday, November 9, 2019

పాల బొబ్బట్లు తాయారు చేయడం | పాకశాల - Pakashala



కావలసినవి

పాలు-2లీటర్లు
చక్కెర-రెండు కప్పులు,
బాదంపప్పు-15
జీడిపప్పు-15,
యాలకులు-4 


కుంకుమపువ్వు -కొంచెం,
పోళీ చేసేందుకు కావలసినవి
మైదాపిండి-రెండు కప్పులు
సోడా, ఉప్పు, నూనె-కొద్డిగా



తయారుచేసే విధానం : పాలను తక్కువవేడిలో పెట్టి బాగా కాయాలి.
బాదం, జీడిపప్పులను నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి లిక్విడ్‌గా చేసుకోవాలి.
పాలు బాగా సగానికి సగం తగ్గిన తర్వాత దాంట్లో చక్కెర, బాదం జీడిపప్పుల లిక్విడ్‌, యాలకులపొడి అన్నీవేసి కలపాలి.
వెడల్పైన పాత్రలో పోసి బాగా ఆరనీయాలి. తర్వాత మైదాపిండితో చిన్న చిన్న పూరీలు చేసి, పాలలో వేయాలి.
5నిమిషాల తర్వాత పాలలో ఊరిన పూరీలను తీసి, ఒక ప్లేట్లో వేసి దానిపై కొంచెం చక్కెరపొడి చల్లి, కుంకుమపువ్ఞ్వతో అలంకరించి సర్వ్‌ చేయాలి.
చాలా రుచికరమైన బొబ్బట్లు ఇవి.







No comments:

Post a Comment