Sunday, April 26, 2020

సీతాఫలం కలాకంద్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala





కావలసిన పదార్థాలు: 







పాలు - రెండు లీటర్లు,
నిమ్మరసం - రెండు టీస్పూన్లు,
పంచదార - రెండు టీస్పూన్లు,
యాలకుల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు,
సీతాఫలం గుజ్జు - పావు కప్పు,
నెయ్యి - ఒకకప్పు,
పిస్తా - అరకప్పు,
బాదం - ఐదారు పలుకులు.
సిల్వర్‌ ఫాయిల్‌ - కొద్దిగా.     


తయారీ విధానం: 







రెండు పాన్‌లలో పాలను సమానంగా తీసుకోవాలి. ఒక పాన్‌లోని పాలు సగానికి వచ్చే వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. 


తరువాత మరో పాన్‌లో ఉన్న పాలను మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో నిమ్మరసం వేయాలి.
దాంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్‌ ఆర్పేసి ఒక కాటన్‌ వస్త్రం సహాయంతో పాలు వడబోస్తే పన్నీర్‌ మిగులుతుంది. 


ఈ పన్నీర్‌ను బాగా మరిగించి పెట్టుకున్న పాలలో కలపాలి. మళ్లీ స్టవ్‌పై పెట్టి చిన్నమంటపై కొద్దిసేపు ఉంచాలి.
కాసేపయ్యాక పంచదార, యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌ అడుగున నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం పోయాలి. 


ప్లేట్‌ అంతటా సమంగా వచ్చేలా చూసుకోవాలి. పిస్తా, సిల్వర్‌ ఫాయిల్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.
తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. 

క్యారెట్ ఐస్‌క్రీం తయారు చేయడం | పాకశాల - Pakashala





కావాల్సినవి :




క్యారెట్‌ జ్యూస్‌ - రెండు కప్పులు,
పాలు - రెండు కప్పులు,
చక్కెర - రెండు కప్పులు,
క్రీమ్‌ - ఒక కప్పు,
బాదం, పిస్తాలు - అరకప్పు,
మొక్కజొన్న పిండి - రెండు చెంచాలు






తయారీ :




పాలలో చక్కెర వేసి స్టౌ మీద పెట్టాలి. కొద్ది పాలలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పాలలో వేసి కలపాలి. పాలు చిక్కగా అయ్యాక క్రీమ్‌ వేసి కలపాలి. 

పది నిమిషాలు మరిగాక క్యారెట్‌ జ్యూస్‌ వేసి కలపాలి. మిశ్రమం మరింత చిక్కగా అయ్యేవరకు మరిగించి దించేసుకోవాలి.



చల్లారాక డీప్‌ ఫ్రీజ్‌లో పెట్టాలి. ఒక గంట తరువాత తీసి మిక్సీలో బాగా బ్లెండ్‌ చెయ్యాలి.
దీనివల్ల ఐస్‌క్రీం మరింత సాఫ్ట్‌గా ఉంటుంది. బ్లెండ్‌ చేశాక దీనిపై బాదం, పిస్తాలను అలకరించుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.



గట్టిబడిన తరువాత ఇక ఆలస్యం చేయకుండా ఆరగించండి.

Tuesday, April 21, 2020

నిమ్మ – పుదీనా డ్రింక్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala



నిమ్మ – పుదీనా డ్రింక్‌

Lemon – Mint Drink




ఎండాకాలం లిక్విడ్లు ఎక్కువగా తాగాలనిపించడం సహజం. అలాంటి వాటిలో నిమ్మ – పుదీనా డ్రింక్‌ ఎంతో మేలు చేస్తుంది. జనరల్‌గా పుదీనా డ్రింక్‌ని రోడ్లపై అమ్ముతుంటారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది కాబట్టి ఇలాంటివేవీ రోడ్లపైకనిపించడం లేదు. అయితే బయటి కంటే ఇంట్లో మనమే సొంతంగా చక్కగా నిమ్మపండు- పుదీనా డ్రింక్‌ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.

కరోనా వైరస్‌ ప్రబలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి డ్రింక్‌ తాగితే వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఎక్కువగా చల్లగా అయ్యే వరకు పెట్టకూడదు. అసలు చల్లగా లేకుండానే తాగితే ఎంతో మంచిది. ఎందుకంటే ఫ్రిజ్‌లో వచ్చేది సహజమైన కూలింగ్‌ కాదు. అది మన శరీరానికి సెట్‌ కాదు. కూల్‌ వాటర్‌ తాగినా గొంతులో గరగర మంటుంది. అందుకే వీలైనంత వరకు కూలింగ్‌ లేకుండా చూసుకోవాలి.

ఎండలో పనిచేసి బాగా అలసిపోయిన వారు ఈ నిమ్మ – పుదీనా డ్రింక్‌ తాగిగే ఎనర్జీ వస్తుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి అరకప్పు నీళ్లు పోసి 10 సెకండ్ల పాటు మిస్కీలో బ్లెండ్‌ చేయాలి.

దీన్ని వడగట్టి ఆ వచ్చిని రసాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు పుదీనా రసాన్ని తీసుకుని అందులో నిమ్మరసం, ఉప్పువేసి బాగా కలపాలి. ఐస్‌ ముక్కలు వేసుకుని పుదీనా రసాన్ని గ్లాసులో పోసి లిమ్కా, లేదా స్ప్రైట్‌ డ్రింకును ఆ జ్యూస్‌లో చేర్చుకుని తాగాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అతిధులకు అందించేటప్పుడు పొడవాటి గ్లాసులో పుదీనా రసం పోసి ఐస్‌ ముక్కలు వేసి నిమ్మరసం, ఉప్పు కలిపిన ద్రావణాన్ని పోసి, మీకు ఇష్టమైన డ్రింకును చేర్చి అందించవచ్చు. సమ్మర్‌లో చాలా మంది ఈ జ్యూస్‌ తాగుతుంటారు. ఏ డ్రింక్‌ తాగిని మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి.

మసాలా ఆవడ తయారు చేయడం | పాకశాల - Pakashala






కావలసిన పదార్థాలు


శెనగపప్పు- అరకప్పు
కందిపప్పు – అరకప్పు
పెసరపప్పు – అరకప్పు
మినప్పప్పు – అరకప్పు
జీడిపప్పు పలుకులు – పావుకప్పు
కొత్తిమీర- ఒక కట్ట
పుదీనా – ఒక కట్ట
పచ్చిమిర్చి – ఆరు
అల్లం – చిన్న ముక్క
కరివేపాకు – రెండు రెబ్బలు
వంటసోడా – పావుచెంచా
ఉప్పు -తగినంత
నూనె వేయించేందుకు సరిపడా తాలింపు కోసం : పెరుగు – మూడు కప్పులు
క్యారెట్‌ తురుము – పావు కప్పు
పచ్చిమిర్చి – రెండు
అల్లం తరుగు – చెంచా
ఉప్పు – తగినంత
ఆవాలు, మినప్పప్పు – చెంచా చొప్పున
నూనె – చెంచా
కొత్తిమీర తరుగు – చెంచా




తయారు చేయువిధానం


శెగపప్పు, మినప్పపు, కందిపప్పు, పెసరపప్పులను రెండు గంటల ముందుగా నీళ్లుపోసి నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి మెత్తగా పిండి రుబ్బాలి.


రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని సెనపప్పు ముద్దపై వేయాలి. అలాగే తగినంత ఉప్పు, వంటసోడా కూడా వేసుకుని మరోసారి కలపాలి.
ఈ పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడడి చల్లారాక వేడి నీటిలో వేసి నిమిషమయ్యాక తీసేయాలి.
ఈ వడల్ని ఇప్పుడు ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు కలిపిన పెరుగులో వేసుకోవాలి.
బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు వేయించి దింపేయాలి.
ఈ తాలింపు వేడి చల్లారాక పెరుగుపై వేయాలి.చివరగా క్యారెట్‌ తురుము, కొత్తిమీరతో అలంకరిస్తే సరిపోతుంది.





Saturday, April 11, 2020

వెనిల్లా ఐస్‌క్రీం తయారు చేయడం | పాకశాల - Pakashala




కావల్సినవి : 



గుడ్లు - నాలుగు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి),
చక్కెర - పావుకప్పు,
మొక్కజొన్న పిండి - చెంచా
(కొన్ని పాలతో చిక్కగా చేసుకోవాలి), క్రీమ్‌ - కప్పు,
చిక్కటి పాలు - అరకప్పు, ఉప్పు - చిటికెడు,
వెనిల్లా ఎసెన్స్‌ - చెంచా



తయారీ : 

అడుగు మందంగా ఉండే పాత్రలో పచ్చసొనా, చక్కెర, మిగిలిన పాలూ, మెక్కజొన్న మిశ్రమం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
ఇప్పుడు క్రీమ్‌ వేసి మరోసారి కలపాలి. ఈ పాత్రను సన్నని మంటపై ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
చిక్కగా అయ్యాక ఉప్పూ, వెనిలా ఎసెన్స్‌ కలిపి దింపేయాలి.
ఇది బాగా చల్లారాక మరో గిన్నెలోకి తీసుకుని డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.
నాలుగైదు గంటలకు గట్టిబడుతుంది. తర్వాత బయటకు తీసి మీకు కావాలనుకుంటే దీనిపై చాక్లెట్‌ పలుకులు వేసుకోవచ్చు.
తర్వాత చల్ల చల్లగా సర్వ్‌ చేయండి.






Thursday, April 9, 2020

కొబ్బరి బూరెలు తయారు చేయడం | పాకశాల - Pakashala


కావలిసినవి ::

బియ్యప్పిండి - కేజీ, 

బెల్లం - ముప్పావు కేజీ, 


కొబ్బరి ముక్కలు - రెండు,
డాల్డా - 100గ్రాములు,
నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా.


 తయారీ విధానం: 

బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్‌ చేయాలి.కొబ్బరి ముక్కలు, బెల్లంను విడిగా గ్రైండర్‌ వేసి పొడి చేసుకోవాలి.
వెడల్పాటి పాన్‌లో బెల్లంను వేడి చేయాలి. బెల్లం త్వరగా కరగడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. 
బెల్లం పానకం వేళ్లకు అంటుకున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు ఈ పానకంలో కొబ్బరి పొడి యాలకుల పొడి, డాల్డా వేసి కలియబెట్టాలి.
ఇప్పుడు బియ్యప్పిండి వేసి కలపాలి.తరువాత పిండిని చిన్నచిన్న బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి.
పాన్‌లో నూనె పోసి బూరెల్ని గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.

పనస గింజల వడలు తయారు చేయడం | పాకశాల - Pakashala



 కావలసిన పదార్థాలు: 


పనస గింజలు - 2 కప్పులు, 

బియ్యప్పిండి - ఒక కప్పు, 


పచ్చిమిర్చి - 4, 

పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, 


ఉల్లి తరుగు - అరకప్పు,
జీలకర్ర - ఒక టీ స్పూను, 


ఉప్పు - రుచికి సరిపడా,
కొత్తిమీర తరుగు - పావుకప్పు, 


అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను,
నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: 


పనస గింజల పై పొట్టు తీసి కుక్కర్లో ఉడికించాలి. 

మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర, ఉల్లితరుగు, బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొంత కొంత తీసుకుని వడలుగా ఒత్తి కాగిన నూనెలో దోరగా రెండువైపులా వేగించుకోవాలి.

ఇష్టమైనవారు ఇదే మిశ్రమాన్ని పకోడీగా కూడా వేసుకోవచ్చు.